News

ఆడిటర్ విజయసాయిరెడ్డికే తెలుసు


తన సంస్థలలో పెట్టిన పెట్టుబడులకు సంబందించిన సమాచారం అంతా ఆయన ఆడిటర్ విజయసాయిరెడ్డికే తెలుసని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ చెప్పడం ఆసక్తికరంగా ఉంది. తన సంస్థలలో పెట్టుబడులు పెట్టినవారిలో పలువురితో పెద్దగా సంబందాలు లేవని , పొట్లూరి ప్రసాద్ అంతగా తెలియదని ఆయన స్పష్టం చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఇచ్చిన సమాదానాలలో ఈ విషయాలు ఉన్నాయి.నిమ్మగడ్డ ప్రసాద్ కు సంబందించిన ప్రశ్నలకు మాత్రం ఆయన స్పష్టమైన సమాదానాలు ఇచ్చారు. సాక్షిలో 450 కోట్ల పెట్టుబడి పెట్టారని, అందుకే డైరెక్టర్ పదవి ఆఫర్ ఇచ్చామని ఆయన చెప్పారు. కాగా సిమెంట్ కంపెనీలో 300 కోట్ల పెట్టుబడికి గాను 600 కోట్ల ఆదాయం పొందారని ఆయన వివరించారు.స్థూలంగా జగన్ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డికే అన్ని విషయాలు తెలుసు అని జగన్ చెప్పదలిచినట్లుగా ఉంది.అప్పట్లో ఆయనే ఈ పెట్టుబడులు సాదించడంలో కీలక పాత్ర పోషించారని వార్తలు వచ్చాయి